ఏజెన్సీలో ఎదురుకాల్పులు
విశాఖపట్నం : జిల్లాలోని ఏజెన్సీ ప్రాంతంలో మావోయిస్టులకు, పోలీసులకు మధ్య ఎదురుకాల్పలు చోటుచేసుకున్నాయి. అంతకుముందు బాక్సైట్ తవ్వకాలకు అనుకూలంగా వ్యవహరిస్తూన్నాడంటూ స్థానిక రాజకీయ నాయకుడి ఇంటికి వెళ్లిన నక్సల్స్ ఫర్చీచర్ ను ధ్వంసం చేసి ఏజెన్సీ నుంచి వేరే ప్రాంతానికి వెళ్లపోవాలని హెచ్చరించారు. అనంతరం సమీపంలోని రాష్ట్ర కాపీ అభివృద్ధి సంస్థ కార్యాలయానికి వెళ్లి కంప్యూటర్లు, ఫర్నీచర్ ను ధ్వంసం చేసారు. ఈ విషయం తెలిసి పోలీసులు అక్కడికి చేరుకోవడంతో ఇరువర్గాల మధ్య కాల్పులు జరిగాయి. అనంతరం నక్సల్స్ తప్పించుకుని వెళ్లిపాయారు.
News Posted: 18 February, 2010
|