'నిత్య పెళ్లికొడుకును వదలం'
విశాఖపట్నం : ఒకరికి తెలియకుండా మరొకరు చొప్పున ఏడుగురు యువతులను పెళ్లి చేసుకున్న జగదాంబ థియేటర్ యజమాని కొడుకు జగదీష్ కోసం పోలీసులు వేట సాగిస్తున్నారు. ఆయన్ను పట్టుకునేందుకు రెండు ప్రత్యేక పోలీసు దర్యాప్తు బృందాలను ఏర్పాటు చేసినట్లు నగర పోలీసు కమిషనర్ సాంబశివరావు చెప్పారు. జగదీష్ బాధితుల్లో ఒక్కోక్కరుగా బయటకు వస్తున్నారు.
ఇప్పటికి కృష్ణ తులసి, సంధ్య, వెంకటరాణిలు మాత్రమే బయటకు వచ్చారు. తనని మోసం చేసి పెళ్లి చేసుకుని నిర్భంధించారని మూడో భార్య సంధ్యారాణి చెప్పారు. తనని తల్లితండ్రులతో కూడా మాట్లాడనిచ్చే వారు కాదని ఆమె తెలిపింది. జగదీష్ పై ఇప్పటివరుకు ఇద్దరు ఫిర్యాదు చేసారని కమిషనర్ మీడియాతో చెప్పారు. కేసుల తీవ్రతను బట్టి సెక్షన్ లు మారుస్తామని చెప్పారు.
News Posted: 19 February, 2010
|