గుంటూరు : సూర్య లంకను ప్రఖ్యాత పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దడానికి కృషి చేస్తానని కేంద్ర మంత్రి పనబాక లక్ష్మీ చెప్పారు. ఈ ప్రాంతం పర్యాటక రంగ అభివృద్ధికి ప్రణాళికను ఖరారు చేస్తున్నట్లు ఆమె వెల్లడించారు. కేంద్రం నుండి ఐదు కోట్ల రూపాయలను నిధులు మంజూరు చేయిస్తానని ఆమె హామీ ఇచ్చారు. ఈ నిధుల ద్వరా మరింత అభివృద్ధి చేసి పర్యాటకులను ఆకర్షించేందుకు కృషి చేస్తామన్నారు.