విశాఖపట్నం : నకిలీ స్టాంపుల కుంభకోణం కేసులో అబ్దుల్ కరీం తెల్గీని పోలీసులు బుధవారం నగర రెండో అదనపు జడ్జి ఎదుట హాజరు పరిచారు. 19 ఏళ్లుగా జ్యూడిషియల్ కస్టడీలో ఉన్న తెల్గీ సుమారు 30 వేల కోట్ల స్ఠాంపుల కుంభకోణంలో ప్రధానా ముద్దాయి. ఇప్పటివరకు బెంగళూరు జైల్లో ఉన్న తెల్గీని విచారణ నిమిత్తం ప్రత్యేక పోలీసులు మంగళవారం విశాఖకు తీసుకువచ్చారు. అతన్ని సెంట్రల్ జైల్లో ఉంచిన పోలీసులు బుధవారం ఉదయం కోర్టుకు తీసుకువెళ్లారు.