కేసీఆర్ కు పిండ ప్రదానం
విశాఖపట్నం : తెలంగాణ రాష్ట్ర సమితి అధ్యక్షుడు కె చంద్రశేఖర్ రావు, తెలంగాణ జేఏసీ అధ్యక్షుడు ప్రొఫెసర్ కోదండరామ్ లకు సమైక్యాంధ్ర విద్యార్థి జేఏసీ పిండప్రదానం చేసింది. సమైక్యాంధ్రపై కేసీఆర్, కోదండరామ్ ల వైఖరికి నిరసనగా బీచ్ లో వారిద్దరి ఫోటోలకు దండలు వేసి పూజూలు చేయించి పిండ ప్రదానం చేసినట్లు విద్యార్థి జేఏసీ నాయకుడు కిశోర్ కుమార్ వెల్లడించారు. కేసీఆర్, కోదండరామ్ లు బతికున్నా, నైతికంగా మరణించారని వారు విమర్శించారు. విద్యార్థుల ఉన్నతికి తొడ్పడాల్సింది పోయి, ఆత్మహత్యలకు పురిగొల్పుతున్నారని ఆయన మండిపడ్డారు.
తమ పదవుల కోసం రాష్ట్రాన్ని ముక్కలు చేసేందుకు కేసీఆర్ పన్నుతున్న కుతంత్రాలను బట్టబయలు చేసే శక్తిని తెలంగాణ ప్రజలకు ఇవ్వాలంటూ వారు గంగమ్మ తల్లికి పూజలు చేసారు. తన పిల్లలను విదేశాల్లో ఉన్నత చదువులు చదివించుకున్న కేసీఆర్, విద్యార్థలను కనీసం పరీక్షలు కూడా రాయనీయకుండా రెచ్చగొడుతున్నాడని పీసీసీ సభ్యుడు జి ఎ నారాయణరావు, జేఏసీ జాయింట్ కన్వీనర్ గోవిందరావులు ఆరోపించారు.
News Posted: 24 February, 2010
|