మీడియాకు ఆమంచి సారీ
హైదరాబాద్ : ప్రకాశం జిల్లా ఆమంచి కృష్ణమోహన్ మీడియాకు సారీ చెప్పారు. మీడియా ప్రతినిధులను కించపరిచేలా గతంలో చేసిన వ్యాఖ్యలను ఆయన వెనక్కి తీసుకున్నారు. ఏపీయూడబ్యూజే సూచనల మేరకు ఆయన గురువారం ఉదయం అసెంబ్లీ మీడియా పాయింట్ వద్ద మాట్లాడారు. ఓ ఛానల్ సీఈఓపైనా, మరో ఛానల్ అధిపతిపైన తొందరపడి తాను చేసిన వ్యాఖ్యలను వెనక్కితీసుకుంటున్నట్లు తెలిపారు.
News Posted: 25 February, 2010
|