వైభవంగా తెప్పోత్సవం
తిరుపతి : తిరుమల తిరుపతిలోని తెప్పోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. బుధవారం ప్రారంభమైన ఈ ఉత్సవాలను తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు ఆత్యంత వైభవోపేతంగా నిర్వహిస్తున్నారు. ఐదు రోజులపాటు జరిగే ఈ ఉత్సవాల్లో భాగంగా గురువారం శ్రీకృష్ణుడు, రుక్ముణి దేవీల విగ్రవహాలను పల్లకిలో ఉంచి శ్రీవారి పుష్కరణిలో ఊరేగింపు నిర్వహించారు. ఈ తెప్పోత్సవాన్ని తిలకించేందుకు భారీ సంఖ్యలో భక్తులు తరలివచ్చారు. టిటిడి ప్రత్యేక అధికారి ధర్మారెడ్డి, ఇతర అధికారుల పర్యవేక్షణలో ఈ ఉత్సవం కనులవిందుగా సాగింది.
News Posted: 25 February, 2010
|