ప్రకాశం : కొండ చరియలు విరిగిన చీమకుర్తి గ్రానైట్ ప్రమాద స్థలాన్ని మంత్రి బాలినేని శ్రీనివాస రెడ్డి శుక్రవారం ఉదయం పరిశీలించారు. ఘటనా వివరాలను అధికారులను అడిగి ఆయన తెలుసుకున్నారు. ఘటనా స్థలంలో సాగుతున్న సహాయక చర్యలను ఆయన పర్యవేక్షించారు. ప్రకాశం జిల్లా ఇన్ చార్జి మంత్రి శత్రుచర్ల విజయరామరాజు ఘటనా స్థలికి చేరుకునేందుకు హైదరాబాద్ నుండి పయనమయ్యారు.