తిరుపతి : తిరుమల తిరుపతి దేవస్థానం పరిపాలనా భవనం వద్ద నిర్వాసితుల ఆందోళన శుక్రవారం కూడా కొనసాగుతోంది. తమ సమస్యల పరిష్కారం కోసం బాధితులు గత 21 రోజులుగా పరిపాలనా భవనం ఎదుట రిలే నిరాహార దీక్షలు సాగిస్తున్నారు. టీటీడీలో ప్రజా సమస్యల పరిష్కారానికి పరిపాలనా భవనం 48 గంటల ముట్టడికి అఖిలపక్షం పిలుపునిచ్చింది. బాధితులు పాలనా భవనం ఎదుట బైఠాయించి తమ నిరసన తెలుపుతున్నారు.