గుంటూరు : గ్రానైట్ క్వరీ ఘటనకు బాధ్యత వహిస్తూ తనను పదవికి రాజీనామా చేసే హక్కు టీడీపీ నేత కోడెల శివప్రసాద్ కు లేదని భూగర్భ శాఖ మంత్రి బాలినేని శ్రీనివాస రెడ్డి అన్నారు. ఆయన తన నివాసంలో మీడియాతో శనివారం మాట్లాడారు. సొంద ఇంటిలో బాంబులు పేలినపుడు కోడెల పదవికి ఎందుకు రాజీనామా చేయలేదో చెప్పాలని ఆయన డిమాండ్ చేసారు. విమర్శలు మానుకొని సహాయక చర్యల్లో పాల్గొంటే మంచిదని ఆయన హితవు పలికారు.