తిరుపతి : తిరుమలలో గత ఐదు రోజులుగా జరుగుతున్న శ్రీవారి తెప్పోత్సవ వేడుకలు ముగిసాయి. ఆదివారం ఈ ముగింపు వేడుకలను అత్యంత వైభవోపేతంగా నిర్వహించారు. మలయప్పస్వామి వారి విగ్రహాలను శ్రీవారి ఆలయం నుండి పుష్కరణి వరకు ఊరేగింపు చేసారు. అనంతరం పుష్కరణిలో తెప్పోత్సవం జరిపారు. తిరుమల తిరుపతి దేవస్థాన ప్రత్యేక అధికారి ధర్మారెడ్డి ఈ ఉత్సవ ఏర్పాట్లను పర్యవేక్షించారు.