ఘనంగా శ్రీవారి కల్యాణ వేడుకలు
తిరుపతి : కలియుగ ప్రత్యక్ష దైవం తిరుమల తిరుపతి వెంకటేశ్వర స్వామి వారి వార్షిక కల్యాణ మహోత్సవాలు అంగరంగ వైభవంగా జరిగాయి. కన్యాకుమారిలోని వివేకానంద కల్యాణమండపంలో ఆదివారం ఈ వేడుకలను ఘనంగా నిర్వహించారు. తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలో ఈ వేడుకలను జరిపారు. దేశవ్యాప్తంగా అన్ని ఆలయాల్లోనూ శ్రీవారి కల్యాణ ఉత్సవాలను వైభవోపేతంగా జరిపారు. పురోహితుల వేద మంత్రోచ్ఛారణల మధ్య పద్మావతి, లక్ష్మీదేవీలను వెంకటేశ్వర స్వామి వారు వివాహమాడారు. ఈ వేడుకలను తిలకించేందుకు పెద్ద ఎత్తున భక్తులు తరలివచ్చారు.
News Posted: 1 March, 2010
|