విద్యార్థుల సస్పెన్షన్
గుంటూరు : విజ్ఞాన్ ఇంజనీరింగ్ కాలేజీలో ర్యాగింగ్ కు పాల్పడిన నలుగురు విద్యార్థులు సస్పెండ్ కు గురయ్యారు. జడ్పీ చైర్మన్ కుమారిడితో సహా పలువురు విద్యార్థులపై సీనియర్లు కులం పేరుతో ర్యాగింగ్ కు పాల్పడిన సంగతి తెలిసిందే. దీనిపై స్థానిక పోలీస్టేషన్ లో బాధితులు ఫిర్యాదు చేసారు. ఆంధ్రప్రదేశ్ ర్యాగింగ్ నిరోధ చట్టం, ఎస్సీ, ఎస్డీ అట్రాసిటీ కేసులు కింద నిందుతులపై అభియోగం మోపారు. ఈందుకు బాధ్యులైన నలుగురు విద్యార్థులను విజ్ఞాన్ ఇంజనీరింగ్ కాలేజీ యాజమాన్యం సస్పెండ్ చేసిందని సోమవారం పోలీసులు తెలిపారు.
News Posted: 1 March, 2010
|