గోపీచంద్ శతజయంతి ఉత్సవాలు
గుంటూరు : తెలుగు సాహితీ ప్రపంచంలో త్రిపురనేని గోపీ చంద్ ఓ ధృవతార అని వక్తలు ప్రశంసించారు. తన రచనలలో మధ్య తరగతి జీవనశైలిని కళ్లకు కట్టినట్లు చూపారన్నారు. ప్రముఖ సాహితీవేత్త త్రిపురనేని గోపీచంద్ శతజయంతి ఉత్సవాలు జిల్లాలోని తెనాలిలో సోమవరాం ప్రారంభమయ్యాయి. ఈ కార్యక్రమానికి గోపీచంద్ కుమారుడు సాయిచంద్ హాజరయ్యారు. కేంద్ర సాహిత్య అకాడమీ ఈ ఉత్సవాలను నిర్వహిస్తోంది. ఈ సందర్భంగా చర్చా గోష్టి జరిగింది. చింతనాపరుడిగా, అన్వేషకుడిగా, వైవిధ్యభరితమైన సాహితీసంపదను అందించిన వాడిగా సాయి చంద్ ఆయనను కొనియాడారు. తమది కర్నూలు జిల్లా అయినా తమ తమ తండ్రి రచనలను ఆదరించిన తెనాలి అంటే తనకు ఎంతో మక్కువని ఆయన అన్నారు.
News Posted: 1 March, 2010
|