గుంటూరు : రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి గాదె వెంకటరెడ్డి సోమవారం తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. ఆయన గత కొద్దికాలంగా షుగర్ వ్యాధితో బాధపడుతున్నారు. సోమవారం షుగర్ లెవల్ పడిపోవడంతో శ్వాస తీసుకోవటం కష్టమైంది. దీంతో ఆయన్ను వెంటనే పొన్నూరులోని రవి ఆసుపత్రికి తరలించారు. ప్రాథమిక చికిత్స అనంతరం ఆయన్ని గుంటూరులోని ప్రైవేటు ఆసుపత్రికి తరలించి వైద్య సేవలు అందించారు. తరువాత ఆయన ఆరోగ్యం కుదుటపడింది. గెదె అనారోగ్యం వార్త తెలుకున్న ముఖ్యమంత్రి రోశయ్య ఆయనకు ఫోన్ చేసి వివరాలు అడిగి తెలుసుకున్నారు. అవసరమైతే ప్రత్యేక హెలికాప్టర్ లో హైదరాబాద్ కు తీసుకువచ్చి వైద్య సేవలు అందించాలని అధికారులకు ఆయన సూచించారు.