తిరుపతి : తిరుమలలో మంగళవారం తెల్లవారుజామున ఘోర అగ్నిప్రమాదం సంభవించింది. సీఆర్వో కార్యాలయానికి ఎదురుగా ఉన్న దుకాణాల సముదాయంలో ఒక్కసారిగా మంటలు ఎగిసిపడ్డాయి. ఈ ప్రమాదంలో 17 దుకాణాలు దగ్ధమయ్యాయి. సుమారు 15లక్షల రూపాయన ఆస్తి నష్టం వాటిల్లింది. ఘటనాస్థలానికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపులోకి తీసుకువచ్చారు. విద్యుత్ షార్టు సర్య్కూట్ ప్రమాదానికి కారణంగా తెలుస్తోంది.