శ్రీవారికి తిరుమంజన సేవ
తిరుమల : ఉగాది సందర్భంగా తిరుమల శ్రీవారి ఆలయంలో కోయిల్ అళ్వార్ తిరుమంజన సేవ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భాగంగా ఆలయాన్ని శుద్ధి చేసారు. దీంతో అన్ని ఆర్జిత సేవలను రద్దు చేసారు. ఏటా ఉగాది, అణివార అస్థానం, బ్రహ్మోత్సవాలు, వైకుంఠ ఏకాదశి సందర్భంగా కోయిల్ అశ్వార్ తిరుమంజన సేవలు నిర్వహిస్తారు. తిరుమల జన సేవ సందర్భంగా మధ్యాహ్నం 12 గంటల తరువాతే సర్వదర్శనం ప్రారంభిస్తారు.
News Posted: 8 March, 2010
|