తిరుపతి : తిరుమల తిరుపతి వెంకటేశ్వరస్వామి వారి సర్వదర్శనం పున:ప్రారంభమైంది. ఉగాదిని పురస్కరించుకొని ఆలయంలో ఏటా నిర్వహించే కోయిల్ అళ్వార్ తిరుమంజన(ఆలయ శుద్ధి) నిర్వహించడంతో శ్రీవారి దర్శనాన్ని నిలిపివేసారు. మంగళవారం మధ్యాహ్నాం నుండి మళ్లీ సేవలను పునరుద్దరించారు.