స్త్రీలపై ఎస్సై దౌర్జన్యం
గుంటూరు : సికింద్రాబాద్ నుండి విశాఖ వెళ్తున్న విశాఖ ఎక్స్ ప్రెస్ లో ఓ ఎస్సై స్త్రీలపై దాడికి పాల్పడ్డాడు. ట్రైన్ లో సీట్ల కోసం జరిగిన వివాదంలో తనను ప్రశ్నించిన స్త్రీలపై రేపల్లె ఎస్సై మురళీకృష్ణ ఈఘాతుకానికి పాల్పడ్డాడు. ఐతే ఎస్సై మాత్రం తాను ఎలాంటి దాడికి సిద్ధపడలేదని, తన భార్యకు, ఇతర స్త్రీలకు మధ్య మాత్రమే గొడవ జరిగిందనీ చెబుతున్నాడు. కాగా మద్యం సేవించిన ఎస్సై ఈ దాడికి సిద్దపడినట్లు ప్రత్యక్షసాక్ష్యుల కథనం.
News Posted: 5 March, 2009
|