గుంటూరు : గుంటూరు అరండల్ పేట పోలీస్టేషన్ ఎదుట ఓ యువకుడు పురుగుమందు తాగి ఆత్మహత్యకు పూనుకున్నాడు. అతన్ని చికిత్స కోసం ఆస్పత్రికి తరలిస్తుండగా దారిలోనే మృతి చెందాడు. దాంతో మృతుని బంధువులు పోలీస్ట్ స్టేషన్ ఎదుట ఆందోళనకు దిగారు. యువకుడు మృతి చెందడానికి పోలీసుల వేధింపులే కారణమని వారు ఆరోపించారు.