ఏసీబీకి చిక్కిన ఎంవిఐ
హైదరాబాద్ : అవినీతి నిరోధక శాఖ చేతికి బుధవారం మరో అవినీతి జలగ చిక్కింది. రవాణా శాఖలో మోటార్ వెహికల్ ఇన్స్ పెక్టర్ దశరథం హిమాయత్ నగర్ లోని నివాసంపై బుధవారం ఉదయం ఏసీబీ అధికారులు దాడులు నిర్వహించారు. ఏసీబీ సోదాల్లో సుమారు పది కోట్ల రూపాయల విలువైన అక్రమ ఆస్తులు ఉన్నట్లు అధికారులు గుర్తించారు. ఈ తనిఖీల్లో 2.5 లక్షల రూపాయల నగదు, వివిధ ప్రాంతాల్లో దశరథంకు ఉన్న ఆస్తులకు సంబంధించిన కీలమైన పత్రాలను కూడా అధికారులు స్వాధీనం చేసుకున్నారు. బుధవారం మధ్యాహ్నానికి దశరథం ఇంటిలో ఏసీబీ అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు.
News Posted: 18 February, 2009
|