తిరుపతి : ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన తిరుమలలో శ్రీవేంకటేశ్వర స్వామి వారికి ఉదయం అష్టదళ పాద పద్మారాధన సేవ జరిగింది. రేపు ఉదయం సహస్ర కలశాభిషేక సేవ జరగనున్నదని టిటిడి ట్రస్ట్ పేర్కొన్నది. స్వామి వారిని నిన్న 30 వేల మంది భక్తులు దర్శించుకున్నారు. స్వామివారి ఉచిత దర్శనానికి టిక్కెట్లను ఉదయం 5 గంటల నుండి 8 వరకు ఇస్తున్నారు. శ్రీవారి దర్శనానికి రెండవ క్యూకాంప్లెక్స్ లోని 4 కంపార్ట్ మెంట్లలో భక్తులు వేచి వున్నారు.