ఉచిత క్రీడా శిక్షణా శిబిరాలు
తిరుపతి : జిల్లా వ్యాప్తంగా వేసవిలో క్రీడా శిక్షణా శిబిరాలను నిర్వహించనున్నట్లు క్రీడాభివృద్ధి అధికారి యుగంధర్ తెలిపారు. 20 కేంద్రాల్లో మే 1 నుండి 31వ తేదీవరకు చిత్తూరు, తిరుపతి పట్టణాల్లో శాప్ కోచ్ లు శిక్షణ ఇస్తారన్నారు. ఆసక్తి కలవారు ఈ శిబిరాల్లో పాల్గొనవచ్చుననీ, దీనికి ఎటువంటి రుసుం చెల్లించాల్సిన పనిలేదని వారు తెలిపారు. క్రీడాకారులు కింద తెలిపిన కోచ్ లను నేరుగా కలవాలని ఆయన సూచించారు.
క్రీడా శిబిరాల వివరాలు : 'క్రికెట్' చిత్తూరులో శాప్ కోచ్ ఎస్.సయ్యద్ ఆధ్వర్యంలో మెసానికల్ మైదనాంలో, 'ఖోఖో' చిత్తూరులో శాప్ కోచ్ ఎం.బాలాజీ ఆధ్వర్యంలో మెసానికల్ మైదానంలో, పుట్ బాల్ తిరుపతిలో జె.వెంకటరాములు ఆధ్వర్యంలో ఏస్వీ హైస్కూల్ మైదనంలో, 'బాస్కెట్ బాల్' చిత్తూరులో శాప్ కోచ్ బి.ఉదయభాస్కర్ ఆధ్వర్యంలో మెసానికల్ మైదానంలో, హాకీ చిత్తూరులో శాప్ కోచ్ లక్ష్మీకరుణ ఆధ్వర్యంలో మెసానికల్ మైదనంలో, తిరుపతిలో సీహెచ్ మురళీధర్ ఆధ్వర్యంలో ఎస్వీ ఆర్ట్స్ కాలేజ్ మైదానంలో నిర్వహిస్తారు.
News Posted: 30 April, 2009
|