తిరుపతి : చిత్తూరు జిల్లా రైల్వేకోడూరు మండలం శెట్టిలింగంపల్లి వద్ద తమిళనాడుకు చెందిన ఓ టూరిస్ట్ బస్సు బోల్తా పడంతో16 మంది గాయపడ్డారు. వారిలో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉండడంతో క్షతగాత్రులను తిరుపతిలోని రుయా ఆస్పత్రికి తరలించారు. రాయవారిపల్లెలో ఓ సిమెంట్ లారీ అదుపు తప్పి ఇంట్లోకి దూసుకువెళ్లటంతో ఇద్దరు మృతి చెందారు.