తిరుపతి : పవిత్ర పుణ్యక్షేత్రమైన తిరుపతిలో ప్రతి సంవత్సరం ఆనవాయితీగా నిర్వహించే గంగమ్మ జాతర అమ్మవారి విశ్వరూపంతో నేడు ముగిసింది. ఆలయ ప్రాంగణంలో ప్రత్యేకంగా మట్టితో తయారు చేసిన అమ్మవారిని వేలాది మంది భక్తులు దర్శించుకున్నారు. శ్రీవారి చెల్లెలుగా భావించే గంగమ్మను దర్శించుకోవడానికి భారీ సంఖ్యలో భక్తులు హాజరయ్యారు. జాతర ముగిసిన తర్వాత అమ్మవారి విగ్రహంగా తయారుచేసిన మట్టిని తీసుకు వెళితే శుభం జరుగుతుందని భక్తుల ప్రగాఢ నమ్మకం. దీంతో జాతరలో పాల్గొన్న భక్తులు మట్టికోసం పోటీ పడడంతో తోపులాటలు జరిగాయి.