చిత్తూరు : రొంపిచర్ల మండలం సమీపంలో గురువారం విద్యుద్ఘాతంతో ఇద్దరు రైతులు మరణించడంతో స్థానికంగా విషాదం నెలకొంది. చిత్తూరు జిల్లా రొంపిచర్ల మండలం కె.ఎన్.కురవపల్లిలో ఈ దుర్ఘటన జరిగింది. మరో ఘటనలో పశ్చిమగోదావరి జిల్లా టి.నర్సాపురం మండలం మక్కినవారి పాలెంలో విద్యుద్ఘాతంతో ముగ్గురు కూలీలు గాయపడ్డారు.