తిరుపతి : పుణ్యక్షేత్రమైన తిరుమలలో భక్తుల రద్దీ తీవ్రమైంది. వారాంతపు సెలవులు రావడంతో శ్రీవారిని దర్శించుకునేందుకు భక్తులు పోటెత్తడంతో టిటిడి అధికారులు మహాలఘు దర్శనాన్ని కొనసాగిస్తున్నారు. దర్శనానికి క్యూలైన్లలో 28 కంపార్టు మెంట్లు నిండిపోవడంతో భక్తులు బయట మూడు కిలోమీటర్ల మేర లైన్లు కడుతున్నారు. దీంతో వెంకన్న దర్శనానికి 12 గంటల సమయం పడుతోంది.