తిరుపతి : మహిళలను విక్రయించే ముఠాను పోలీసులు బుధవారం అరెస్ట్ చేశారు. విదేశాల్లో ఉద్యోగాలు ఇప్పిస్తామని స్త్రీలను నమ్మిస్తున్న ఈ ముఠా అరెస్టయింది. ముగ్గురు సభ్యులతో ఉన్న ఈ ముఠా ఓ మహిళను మల్లవరం వద్ద విక్రయించే ప్రయత్నంలో ఉండగా రేణిగుంట పోలీసులు అరెస్ట్ చేశారు. స్త్రీలను అమ్మే ముఠా బారి నుండి జంగారెడ్డి గూడెంకు చెందిన మహిళను రక్షించిన పోలీసులు ముఠా కార్యకలాపాల గురించి దర్యాప్తు ప్రారంభించారు.