హైదరాబాద్ : వరదల తాకిడికి సర్వస్వం కోల్పోయిన బాధితులను ఆదుకునేందుకు ఆంధ్రప్రదేశ్ రియల్ ఎస్టేట్ డెవలపర్స్ అసోసియేషన్ ముందుకొచ్చింది. సంస్థ అధ్యక్షుడు మురళీమోహన్ ఆధ్వర్యంలో బాధితులకు 200 ఇళ్ళు నిర్మంచి ఇవ్వనున్నారు. దానికి తగిన స్థలాన్ని కేటాయించాలని వారు ముఖ్యమంత్రి రోశయ్యను కోరగా రియల్టర్లకు తగిన స్థలాన్ని తప్పక కేటాయిస్తానని సీఎం హామీ ఇచ్చారు. భారీగా నష్టపోయిన ప్రాంతాల్లో నిర్మాణాలు చేపట్టాలని వారికి సీఎం సూచించారు.