గాలిలో తేలుతున్న కాంగ్రెస్!
2004 ఎన్నికలలో కాంగ్రెస్ 545 సీట్లలో 375 సీట్లకు పోటీ చేసింది. కాని ఈ దఫా ఆ సంఖ్యను పెంచుకోవాలని కాంగ్రెస్ కోరుకుంటున్నది. ఆ దిశగా తన మిత్ర పక్షాలతో బేరసారాలను కాంగ్రెస్ ప్రారంభించింది. కాంగ్రెస్ అనుసరిస్తున్న ఈ వ్యూహం కొన్ని మిత్ర పక్షాలతో ఉద్రిక్తతలకు దారి తీసింది. ఎన్ సిపి మహారాష్ట్రలో అధిక వాటాతో పాటు జాతీయ స్థాయిలో మిత్ర పక్షాలకు కనీసం 50 సీట్లు కేటాయించాలని కోరుతున్నది. ఇక ఎస్ పి అయితే యుపిలో సీట్లను వదలుకోవడంలో పీనాసితనం చూపుతున్నది.
ఆంధ్ర ప్రదేశ్, మహారాష్ట్ర, హర్యానా రాష్ట్రాలలో కూడా పార్టీ సీట్ల సంఖ్య తగ్గగలదని కాంగ్రెస్ రాజకీయ వ్యూహకర్తలు గ్రహించారు. ఆంధ్ర ప్రదేశ్ లో కాంగ్రెస్ క్రితం సారి 31 సీట్లను గెలుచుకున్నది. ఈ సారి ఈ సంఖ్య 20కి తగ్గిపోవచ్చునని ఆంతరంగిక మదింపు సూచిస్తున్నది. అయితే, పంజాబ్, రాజస్థాన్, కేరళ, ఛత్తీస్ గఢ్ రాష్ట్రాలలో తన సీట్ల సంఖ్యను పెంచుకోవడం ద్వారా ఈ నష్టాలను భర్తీ చేసుకోవచ్చునని కాంగ్రెస్ ఆశిస్తున్నది. కాంగ్రెస్ క్రితం సారి పంజాబ్ లో 13కు రెండు సీట్లను, రాజస్థాన్ లో 25కు రెండు సీట్లను, ఛత్తీస్ గఢ్ లో 11కు ఒక సీటును గెలుచుకోగా కేరళలో 20కి ఒక్కటి కూడా గెలుచుకోలేకపోయింది.
Pages: -1- 2 News Posted: 5 March, 2009
|