ఎన్టీఆర్ కు `యువ' కిరీటం
ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసినవారినే ఇన్ ఛార్జ్ లుగా కొనసాగించాలని ఆయన యోచిస్తున్నారు. కాగా గ్రేటర్ హైదరాబాద్ అధ్యక్ష పదవి నుండి తనను తప్పించాలని మాజీ మంత్రి విజయరామారావు కోరుతుండడంతో ఆయన స్థానంలో మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ లేదా పార్టీ హైదరాబాద్ ప్రధాన కార్యదర్శి పి.ఎల్.శ్రీనివాస్ ను నియమించాలని చంద్రబాబు యోచిస్తున్నారు. మాజీ ఎమ్మెల్యే సాయన్న కూడా ఈ పదవికి పోటీ పడుతున్నారు. గతంలో నగర మేయర్ గా ఉన్న తీగల కృష్ణారెడ్డి తనకు గ్రేటర్ హైదరాబాద్ అధ్యక్షపదవి కావాలంటూ అధినేతపై ఒత్తిడి తెస్తున్నారు.
అడ్ హాక్ కమిటీల ఏర్పాటుతో పాటు త్వరలో జరగనున్న గ్రేటర్ హైదరాబాద్ మునిసిపల్ ఎన్నికలకు సంబంధించి అభ్యర్థులు ఖరారు, పార్టీ వ్యూహం తదితర అంశాలపై చర్చించేందుకు పార్టీ సీనియర్ నేతలతో టిడిపి అధ్యక్షుడు చంద్రబాబు భేటీ అయ్యారు. అమెరికా నుంచి తిరిగి వచ్చాక అడ్ హాక్ కమిటీలను నియమిస్తానని ఇప్పటికే హామీ ఇచ్చిన చంద్రబాబు ఆ దిశగా నడుం బిగించారు. వచ్చే మహానాడు నాటికి సంస్థాగత ఎన్నికలు నిర్వహిస్తామనీ, ఈ లోపు తాత్కాలిక కమిటీలను నియమిస్తామని చంద్రబాబు ప్రకటించిన విషయం తేలిసిందే. ఇటీవల జరిగిన అసెంబ్లీ, లోక్ సబ ఎన్నికల్లో పార్టీ విజయానికి అహర్నిశలు కృషి చేసినవారి సేవలను పూర్తి స్థాయిలో వినియోగించుకోవాలని ఆయన నిర్ణయించారు. ఓడిపోయిన అభ్యర్థులు నిరుత్సాహపడకుండా వారిని నియోజకవర్గ ఇన్ ఛార్జ్ లుగా నియమించే అవకాశాలు కనిపిస్తున్నాయి. పొత్తుల్లో భాగంగా మహాకూటమిలోని భాగస్వామ్య పార్టీలకు కేటాయించిన 73 అసెంబ్లీ స్థానాల్లో పార్టీని మరింత బలోపేతం చేసేందుకు చర్యలు చేపట్టారు.
Pages: -1- 2 -3- News Posted: 19 June, 2009
|