ఎన్టీఆర్ కు `యువ' కిరీటం
గతంలో ఈ నియోజకవర్గాల్లో ఉన్న ఇన్ ఛార్జ్ ల పనితీరును అధ్యయనం చేసి బాగా పనిచేసేవారినే కొనసాగించాలనీ, ఇటీవలి ఎన్నికల్లో ఈ నియోజకవర్గాల్లో కూటమి అభ్యర్థులకు సహకరించాలని వారిని తప్పించాలని కూడా చంద్రబాబు నిర్ణయించినట్లు సమాచారం. అనుబంధ సంఘాలను సంస్థాగత ఎన్నికలు జరిగేంతవరకు కొనసాగించాలని నిర్ణయించినందున ఆ సంఘాలలో ఉన్నవారు మరో సంవత్సరం పాటు తమ పదవుల్లో ఉంటారని పార్టీ పేర్కొంది. ఒక వ్యక్తికి ఒకే పదవి అన్న విధానం పార్టీలో అమలుచేస్తుండడంతో పొలిట్ బ్యూరోను పూర్థి స్థాయిలో మార్చాలని చంద్రబాబు ప్రతిపాదించారు. పార్టీ సీనియర్ నేతలు, పొలిట్ బ్యూరో సభ్యులైన పూసపాటి అశోక గజపతిరాజు, నాగం జనార్థన్ రెడ్డి, ఎర్రబెల్లి దయాకర్ రావులను పొలిట్ బ్యూరో నుంచి తప్పించే అవకాశాలు కనిపిస్తున్నాయి.
పూసపాటికి టిడిఎల్ పి సమన్వయకర్తగా వ్యవహరిస్తున్న ఎర్రబెల్లి దయాకర్ రావు కూడా పొలిట్ బ్యూరో నుంచి వైదొలగే అవకాశాలు ఉన్నాయి. గతంలో టిడిపిలో ఉండి, తెలంగాణ సాధనకై కొత్త పార్టీని ఏర్పాటు చేసేందుకు పార్టీని వీడిన దేవేందర్ గౌడ్ స్థానం కూడా ఇంకా ఖాళీగానే ఉంది. చంద్రబాబు వియ్యంకుడు, బావమరిది నందమూరిబాలకృష్ణను పొలిట్ బ్యూరోలోకి తీసుకోవాలన్న ఒత్తిడి అభిమానులతో పాటు పార్టీలో తీవ్రంగా ఉంది. వీరికి తోడు కొన్ని సామాజికవర్గాలకు కీలకమైన పొలిట్ బ్యూరోలో స్థానం లేదని వస్తున్న ఆరోపణలను కొట్టిపారేసేందుకు ఆయా సామాజిక వర్గాలకు చెందిన నేతలకు అవకాశం కల్పించే సూచనలున్నాయి. ఇప్పటి వరకు పొలిట్ బ్యూరోలో ఉన్న కాల్వ శ్రీనివాసులు, కెఇకృష్ణమూర్తి, అల్లాడి రాజ్ కుమార్ తదితరులు వెనుకబడిన తరగతులకు చెందినవారు కావడంతో వీరిని కొనసాగించి అశోక గజపతిరాజు, దయాకర్ రావు, నాగం జనార్థన్ రెడ్డి స్థానాల్లో ఇదే సామాజికవర్గాలకు చెందిన నేతలను నియమించేలా లేక ఇతర సామాజిక వర్గానికి చెందిన వారికి అవకాశం ఇవ్వాలా అన్న అంశంపై చంద్రబాబు కసరత్తు చేస్తున్నారు.
నల్లగొండ జిల్లాకు చెందిన సంకినేని వెంకటేశ్వరరావు, వరంగల్ జిల్లాకు చెందిన వేం నరేందర్ రెడ్డి పొలిట్ బ్యూరోలో స్థానం కోసం తీవ్రంగా పోటీపడుతున్నారు. ఇద్దరికీ ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసే అవకాశం దక్కకపోవడంతో చంద్రబాబు వీరి నియామకం పట్ల సానుకూలంగానే ఉన్నట్లు తెలుస్తోంది. మిగతా పార్టీ కార్యవర్గ సభ్యుల నియామకంలోనూ ప్రాంతాలు, సామాజికవర్గాలను పరిగణనలోకి తీసుకోవాలని నిర్ణయించారు. స్థానిక సంస్థల ఎన్నికలను దృష్టిలో ఉంచుకొని కార్యవర్గాన్ని నియమించాలని బాబు కసరత్తు చేస్తున్నారు. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లోపు గ్రామస్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు పార్టీని పూర్తిగా బలోపేతం చేయాలనీ, ఇందుకోసం వారి పార్టీశ్రేణులను సమాయత్తం చేసేందుకు కమిటీలో సమాన అవకాశాలు కన్పించాలని నిర్ణయించారు.
Pages: -1- -2- 3 News Posted: 19 June, 2009
|