ఫస్ట్ లిస్ట్ లోనే కళంకితులు!
యుపిలోని మైన్ పురి నుంచి పోటీ చేస్తున్న ములాయం సింగ్ యాదవ్ పై గల కేసులలో క్రిమినల్ ఉల్లంఘన, కుట్ర నుంచి ఇతరుల పేరును చెడగొట్టేందుకు ఫోర్జరీ చేయడం వరకు కేసులు ఉన్నాయి. ములాయం ఆదాయానికి మించిన ఆస్తులు సంపాదించారనే ఆరోపణపై సిబిఐ దర్యాప్తు పెండింగ్ లో ఉన్న విషయం విదితమే.
రషీద్ మసూద్ (శహరాన్ పూర్), కున్వర్ రేవతీ రమణ్ సింగ్ (అలహాబాద్), బ్రిజ్ భూషణ శరణ్ సింగ్ (కైజర్ గంజ్), దీపక్ కుమార్ (ఉన్నావ్), అశోక్ కుమార్ సింగ్ చాందెల్ (హమీర్ పూర్) వంటి ఇతర ఎస్ పి అభ్యర్థులపై కూడా అల్లర్లు, చట్టవిరుద్ధంగా గుమిగూడడం, బెదరింపులకు పాల్పడడం వంటి కేసులు నమోదై ఉన్నాయి. కాంగ్రెస్ జాబితాలోని కళంకిత అభ్యర్థులలో రాజ్ బబ్బర్ (ఫతేపూర్ సిక్రీ) కాకుండా సురేంద్ర ప్రకాశ్ గోయెల్ (బన్స్ గావ్), జగదంబికా పాల్ (దొమారియాగంజ్), రత్నా సింగ్ (ప్రతాప్ గఢ్) కూడా ఉన్నారు. అల్లర్లు లేవదీశారనే అభియోగాలు బబ్బర్, గోయెల్ లపై నమోదయ్యాయి. బిజెపి కళంకితుల జాబితాలో ప్రహ్లాద్ జోషి (ధార్వాడ్), అనంతకుమార్ హెగ్డె (ఉత్తర కన్నడ), లల్లూ సింగ్ (అయోధ్య), సుభాష్ చంద్ర బర్మన్ (బేలూర్ ఘాట్), భాను ప్రతాప్ సింగ్ వర్మ (జల్గావ్) కూడా ఉన్నారు.
'నేర చరిత్ర కలిగి ఉన్న రాజకీయ నాయకుల సంఖ్య ఉత్తర ప్రదేశ్ లో ఎక్కువగా ఉంది. ఈ శక్తుల కారణంగా శాసనసభ, పార్లమెంట్ సరిగ్గా పని చేయలేకపోతున్నాయి. మనం నిష్కళంకులైన, సమర్థులైన అభ్యర్థులనే ఎన్నుకోవాలి' అని 'న్యూ' సమన్వయకర్త ఐ.సి. ద్వివేది సూచించారు.
Pages: -1- 2 News Posted: 6 March, 2009
|