ఏ పార్టీకి, ఎన్ని నిధులు?
సమాచార హక్కు (ఆర్ టిఐ) చట్టాన్ని ఉపయోగించి 'డిఎన్ఎ' వార్తా సంస్థ 2003, 2007 మధ్య వివిధ రాజకీయ పార్టీలకు అందిన విరాళాల గురించిన అధికారిక గణాంకాలను సేకరించింది. ఈ విరాళాల వెల్లడి ఐచ్ఛికం అయినందున ఈ గణాంకాలు సూచనప్రాయమైనవే గాని వాస్తవాలను వెల్లడించేవి కాకపోవచ్చు. అందువల్ల మాయావతి నాయకత్వంలోని బహుజన్ సమాజ్ పార్టీ (బిఎస్ పి)కి సంబంధించిన వివరాలేవీ లేవు. బిఎస్ పి ఎన్నికల కమిషన్ కు ఏ గణాంకాలనూ సమర్పించలేదు.
ఈ గణాంకాల ప్రకటనలలో అంబానీ సోదరుల విరాళాల వివరాలు కూడా లేవు. ముఖేష్ అంబానీకి కాంగ్రెస్ లో అత్యున్నత స్థాయి నాయకులతో సంబంధాలు ఉండగా అనిల్ అంబానీకి సమాజ్ వాది పార్టీ (ఎస్ పి) నాయకుడు అమర్ సింగ్ తో సన్నిహిత సంబంధాలు ఉన్నాయి. 2003 - 2007 మధ్య వివిధ రాజకీయ పార్టీలకు అందిన విరాళాలలో సింహభాగం కాంగ్రెస్, బిజెపిలదే. ఈ రెండూ దాదాపు సమాన మొత్తాలను అందుకున్నాయి. కాంగ్రెస్ కు 52.42 కోట్లు, బిజెపికి 52.93 కోట్ల రూపాయలు పార్టీ ఫండ్ కింద అందాయి. భారత రాజకీయ వ్యవస్థలో ఈ రెండు ప్రధాన పార్టీలు అధికారంలో ఉన్నా లేకపోయినా వీటి ఆగ్రహానికి గురి కావడానికి ఏ బడా వాణిజ్య సంస్థా కోరుకోదు. కాని సంకీర్ణాలు కూడా ప్రాముఖ్యం సంతరించుకుంటున్నందున చిన్న పార్టీలు కూడా కొద్దో గొప్పో వాణిజ్య సంస్థల విరాళాలు అందుకుంటున్నాయి.
చిన్న పార్టీలకు పెద్ద మొత్తాలు
వాణిజ్య సంస్థల నుంచి విరాళాలు అందుకుంటున్న పార్టీలలో చిన్న చిన్న ప్రాంతీయ పార్టీలు కూడా ఉన్నాయి. ఈ విరాళాలు అందుకున్న ప్రాంతీయ పార్టీలలో శివసేన (రూ 4.17 కోట్లు), సమాజ్ వాది పార్టీ (రూ. 2.45 కోట్లు), తెలుగు దేశం పార్టీ (రూ. 2.25 కోట్లు), కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి డాక్టర్ అన్బుమణి రామదాస్ కు చెందిన పిఎంకె (రూ. 2.86 కోట్లు) చెప్పుకోదగినవి.
Pages: -1- 2 -3- -4- -5- News Posted: 5 March, 2009
|