ఏ పార్టీకి, ఎన్ని నిధులు?
చట్టం అంచున మాత్రమే పని చేస్తుండే రియల్ ఎస్టేట్ గ్రూపులు కూడా ప్రధాన పార్టీల విరాళాల దాత సంస్థలలో స్థానం సంపాదించాయి. మాల్స్, లగ్జరీ అపార్ట్ మెంట్లు నిర్మిస్తుండే, రాజ్ సింగ్ గెహ్లాట్ సారథ్యంలోని ఏంబియెన్స్ గ్రూపు తన గ్రీన్ పార్క్ ఎక్స్ టెన్షన్ ఆఫీసు నుంచి కాంగ్రెస్ కు రూ. 1.05 కోట్లు విరాళంగా అందజేసింది. ఢిల్లీకి చెందిన మరొక నిర్మాణ సంస్థ సోమదత్ బిల్డర్స్ బిజెపికి రూ. 75 లక్షలు విరాళంగా అందజేసింది.
ఇంజనీరింగ్, కన్ స్ట్రక్షన్, ప్రాజెక్ట్ మేనేజ్ మెంట్ సంస్థ పుంజ్ లాయిడ్ బిజెపికి కోటి రూపాయలు విరాళంగా అందజేసింది. రియల్ ఎస్టేట్ డెవలపర్ టుడే హౌస్ అండ్ ఇన్ ఫ్రాస్ట్రక్చర్స్ సంస్థ కాంగ్రెస్ కు రూ. 55 లక్షలను అందజేసింది. హైపర్, సూపర్ మార్కెట్ లను ఏర్పాటు చేస్తుండే జూబిలెంట్ గ్రూపు రూ. 50 లక్షలను, రియల్ ఎస్టేట్ సంస్థ క్రెడా రూ. 47 లక్షలను బిజెపికి అందజేశాయి. సంస్కృతి డెవలపర్స్ సంస్థ కాంగ్రెస్ కు రూ. 50 లక్షలు, శివసేనకు రూ. 15 లక్షలు విరాళంగా అందజేసింది. అంతగా పేరు ప్రఖ్యాతులు లేని ట్రస్ట్ ల నుంచి సుప్రసిద్ధ పారిశ్రామిక సంస్థల వరకు రాజకీయ పార్టీల చక్రాల కదలికకు చేయూత ఇచ్చాయన్నది ఈ జాబితా ద్వారా విదితమవుతున్నది.
Pages: -1- -2- -3- -4- 5 News Posted: 5 March, 2009
|